Feeds:
టపాలు
వ్యాఖ్యలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అసమర్ధ విధానాలే ఎన్.డి.ఎను అధికారంలోకి తెస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. అధిక ధరలు, తీవ్రవాద సమస్యలతో ప్రజలు సుస్థిర ప్రభుత్వం, సమర్ధ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తాము ఎవరితోనూ పొత్తుల కోసం వెంపర్లాడటంలేదని చిరంజీవి ప్రకటనను పరోక్షంగా ప్రస్తావించారు. బీజేపీ అగ్రనాయకుడు లాల్ క్రిష్ణ అద్వానీ చేపట్టిన విజయసంకల్పయాత్ర పోస్టర్ ను ఆయన  హైదరాబాద్‌లో విడుదల చేసారు. విజయసంకల్పయాత్ర సందర్బంగా ఈ నెల 13న సికింద్రాబాద్ లోని పేరెడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు దత్తాత్రేయ తెలిపారు.

రాష్ట్రంలోని  ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థలన్నీ ఇక నుంచి పోలీసుల కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఓ ప్రత్యేక చట్టాన్ని తేనుందని ఆడిషినల్‍ డిజి ఎకే ఖాన్ తెలిపారు. ఎక్కడైతే ప్రయివేటు సెక్యూరిటీలు పనిచేస్తున్నాయో అక్కడ స్థానికంగా సెక్యురిటి భాధ్యతలు కూడా నిర్వహించాల్సివుంటుంది. ఇకనుంచి సెక్యూరిటి ఎజన్సీలలో నియమించే ప్రతి గార్డు బయోడేటా పోలీసులకు తెలియజేయాలి. సెక్యూరిటి ఎజన్సీలు తప్పకుండా పోలీసుల అనుమతి రిజిష్ట్రేషన్ ఉండాలని ఆడిషినల్‍ డిజిపి ఎకెఖాన్ తెలిపారు.

జాక్టోలో చీలిక!

జాక్టో రెండుగా చీలింది. సమ్మె విరమణ జరిగి మూడు రోజులు కాకముందే జాక్టో చీలడం వెనక ప్రభుత్వ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమ్మె విరమణను వ్యతిరేకించిన యూటీఎఫ్‌, డీటిఎఫ్‌, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘాలను మెజార్టీ సంఘాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. 13 రోజుల సమ్మె వల్ల టీచర్లకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఈ మూడు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమను కించపరిచే చర్యలకు పాల్పడినందునే ఆ సంఘాలను బహిష్కరించినట్లు మిగతా సంఘాలు నేతలు చెబుతున్నారు.

హైదరాబాద్‌: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే మార్కెటింగ్‌ మంత్రి మారెప్ప ఈరోజు సినిమా రంగంపై విరుచుకుపడ్డారు. యువగర్జన సభలో నందమూరి బాలకృష్ణ ప్రసంగాన్ని మారెప్ప విమర్శించారు. అసలు సి.. అంటే సిగ్గు, ని.. అంటే నిజాయతీ, మా.. అంటే మానవత్వం లేనిదే ‘సినిమా’ అని మారెప్ప వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌: యువగర్జన సభలో బాలకృష్ణ ప్రసంగంపై విద్యుత్తు శాఖ మంత్రి షబ్బీర్‌ అలీ విరుచుకుపడ్డారు. తొడలుగొట్టేందుకు రాజకీయాలంటే… మూడు గంటల సినిమా కాదని అన్నారు. సినిమాల్లోలాగా రాజకీయాల్లో పహిల్వాన్‌గిరీ చేయడం సాధ్యం కాదనీ, కాంగ్రెస్‌లో అటువంటి పహిల్వాన్లు ఎంతోమంది ఉన్నారని బాలకృష్ణనుద్దేశించి షబ్బీర్‌ వ్యాఖ్యానించారు. అవినీతి గురించి పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు… ఈ అంశంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మాట్లాడేందుకు సిద్ధమా? అని షబ్బీర్‌ ప్రశ్నించారు.

హైదరాబాద్‌: ఎంతోకాలంగా పార్టీ శ్రేణులు, ప్రభుత్వవర్గాలు ఎదురుచూస్తున్న గ్రేటర్‌ ఎన్నికలు వచ్చేశాయి. వచ్చే ఏడాది జనవరిలో గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ చెప్పారు. సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ నేతలతో ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల గురించి వైఎస్‌ సూచనప్రాయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్ మరో రికార్డ్‌ సృష్టించాడు. కెరీర్‌లో వందో టెస్ట్‌ ఆడుతున్న తొలి తెలుగువాడిగా రికార్డ్‌ పుటల్లో నిలిచాడు. ఎందరో క్రికెటర్లకు సాధ్యం కాని శతకాల టెస్ట్‌ కలను నాగపూర్ మ్యాచ్‌ ద్వారా లక్ష్మణ్‌ సాకారం చేసుకుంటున్నాడు. వివిఎస్ అంటే వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్ ఇది లక్ష్మణ్ పూర్తి పేరు. అయితే అభిమానులు మాత్రం వెరీవెరీస్పెషల్ లక్ష్మణ్‌గా పిలుచుకుంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ హైదరాబాదీ బ్యాట్సమెన్ కొట్టే షాట్లు స్టైలిష్‌కు, టైమింగ్‌కు మారుపేరుగా విశ్లేషకులు చెబుతారు. నాగ్‌పూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌తో లక్ష్మణ్ కెరీర్‌లో వంద టెస్టులు పూర్తి చేసుకుంటున్నాడు. దీంతో వంద టెస్టులు ఆడిన తొలి తెలుగువాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. పన్నేండళ్ళ నుంచి భారత క్రికెట్‌కు సేవలందిస్తున్న లక్ష్మణ్‌ ఆసీస్‌తో ఆడిన ప్రతీసారీ కంగారూలకు తన బ్యాట్‌తో లక్ష్మణరేఖ గీశాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. భారత సీనియర్లలో ఒకడిగా వెలుగొందుతున్న లక్ష్మణ్‌ అందరికంటే ఎక్కువ ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఎప్పుడు వేటు వేయాల్సి వచ్చినలక్ష్మణ్‌నే బలిచేసేవారు. ఎన్ని సార్లు రాణించినా అతడికి జట్టులో సుస్థిరం కాలేదు. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాట్‌తోనే తన పని తాను చేసుకుపోయేవాడు. అందుకే అతడి కెరీర్‌లో మరుపురాని ఇన్నింగ్స్‌ ఎన్నో ఉన్నాయి. 2001లో కోల్‌కతా టెస్ట్‌లో ఆసీస్‌ పై రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులతో భారత్‌కు అద్భుత విజయం అందించాడు. ఇక ప్రత్యర్థి జట్లును విపరీతంగా భయపెట్టే నెంబర్‌ వన్‌ ఆసీస్‌కు లక్ష్మణ్‌ అంటే భయం. అతడు అత్యధిక సగటు నమోదు చేసుకున్నది కంగారూలపైనే. అదే జోరును గవాస్కర్‌ బోర్డర్‌ సిరీస్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. అందుకే ఆడుతున్న వందో టెస్ట్‌ అతడి కెరీర్‌లో మరో హైలెట్‌గా ఉండాలని ఆశిద్దాం.

చైల్డ్ అర్టిస్ గా గుర్తింపు తెచ్చుకుని ‘నువ్వేకావాలి’ చిత్రంలో హీరోగా మారి  లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుక్కున్న తరుణ్ ఇటీవల కాలంలో హీరోగా కొద్దిగా  వెన కబడ్డారు. తొలి సినిమా తర్వాత ‘నువ్వులేక నేను లేను’ వంటి రెండు మూడు హిట్లు కొట్టిన తరుణ్ కు ఆ తర్వాత సరైన బ్రేక్ రాలేదు. ఇటీవల ‘నవవసంతం’, ‘భలే దొంగలు’ చిత్రాలతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఇంకా ఓ డీసెంట్ హిట్ ఆయనకు దక్కాల్సి ఉంది. ‘శశిరేఖా పరిణయం’ చిత్రం అలాంటి సక్సెస్ నే అందిస్తుందని తరుణ్ ప్రస్తుతం ఆశాభావంతో ఊన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తరుణ్-జెనీలియా జంటగా రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని తర్వాత సుప్రీం అధినేత రాజు హిర్వాణీ సినిమా కూడా తరుణ్ చేతిలో ఉన్నట్లు సమాచారం. తాజాగా తరుణ్ వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. సొంతంగా ఓ పబ్ ను ఏర్పాటు చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. హైద్రాబాద్ లోని కెబిఆర్ పార్క్ సమీపంలో ఈ పబ్ ఏర్పాటు చేయనున్నారనీ, ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. నాలుగు రాళ్లు వెనుకేసుకునే సమయంలోనే ఇతర రంగాల్లో పెట్టుబడి ద్వారా ప్యూచర్ లో ఆర్ధికపరమైన భద్రతకు తరుణ్ ప్రయత్నించడం తెలివైన పనిగానే చెప్పాలి.

తీపి పదార్థలంటే మీ పిల్లలకు చాలా ఇష్టమా? అయితే ఎన్నో పోషకాలుండే యాపిల్ పండుతో బర్ఫీ చేయడం ఎలాగో చూడండి. పండగరోజుల్లో వచ్చే అతిధులకు, పిల్లలకు వడ్డించడానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన తీయని వంటకమిది. యాపిల్ పండు చెక్కు తీయకుండానే తినాలి. ఎందుకంటే ఫైపొరలోనే ఎంతో మంచి పోషకాలుంటాయి. కాబట్టి ఆచెక్కు తీయకుండానే వంటకం చేయవచ్చు. పంచదార బదులు బెల్లం కూడా వాడ వచ్చు. కావలసిన పదార్థాలు:  సన్నగా తరిగిన యాపిల్ పండు ముక్కలు ఒక కప్పు, కొబ్బరికోరు ఒకటిన్నర కప్పు, పంచదార రెండు కప్పులు, ఆకుపచ్చరంగు మూడు చుక్కలు, పాలు రెండు చెంచాలు, నిమ్మ రసం ఒక చెంచా, బాదం పప్పు పది.   తయారు చేసే విధానం:  ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో కొబ్బరితురుము, పంచదార కలిపి పొయ్యిమీద పెట్టి సన్నని సెగ మీద ఉడికించాలి. గరిటెతో కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతుంది. ఐదూనిమిషాల తర్వాత యాపిల్ ముక్కలు, మూడు చుక్కల రంగు, పాలు కూడా అందులో వేయాలి. బాగా కలపండి. చిక్కబడే దాకా ఉడికించండి. చివరికి నిమ్మరసం వేసి పొయ్యిమీద నుంచి దించేయండి. ఒకప్లేటుకి నెయ్యిరాసి ఉడికించిన మిశ్రమాన్ని ప్లేటులో సమంగా పోయాలి. చిన్న ముక్కలుగా కోయాలి. ఒక్కో ముక్క మీద బాదం పప్పు పెట్టి ఒక గంట పాటు అలాగే ఉండ నీయాలి. బర్ఫీ సిద్దమవుతుంది.

జన్‌షీన్‌లో పోల్‌ డ్యాన్స్‌ చేసి ఎరోటిక్‌ ఎరీనాలో తన టాలెంట్‌ నిరూపించుకున్న సెలీనా జైట్లీ తాజాగా షోమ్యాన్‌ సినిమాలో వలువలకు తిలోదకాలిచ్చే క్లబ్‌ డ్యాన్సర్‌గా తెరవిందు చేయనుంది. విలువలు కాదండీ వలువలే ఈ మూవీ వివరాలను జైట్లీ ఇటీవలే బయటపెట్టింది. ఇంగ్లీష్‌ మనిషి, భారతీయ స్త్రీకి జన్మించి, లండన్‌లో పెరిగి నైట్‌ క్లబ్‌కు ఓనర్‌ కావాలనే తపించే అమ్మాయి పాత్ర పోషిస్తున్నట్లు జెట్లీ చెప్పింది. ఆ నైట్‌ క్లబ్‌లో డ్యాన్స్‌ చేయడానికి డ్యాన్సర్లను ఎట్రాక్ట్‌ చేయడానికి తాను స్ట్రిప్పర్‌గా నటిస్తున్నానని అంటోంది జైట్లీ.