సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నంది అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 16న జరుగనుంది. తొలుత ఈ నెల 8న అవార్డుల ప్రదానం జరపాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు తేదీ ఖరారైంది. హైద్రాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరుగుతుందని ఎఫ్.డి.సి. వర్గాలు తెలిపాయి. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా 2005, 2006 సంవత్సరాలకు గాను నంది అవార్డుల ప్రదానం జరుగుతుంది. కారణాంతరాల వల్ల 2002 తర్వాత ఆగిపోయిన ఎన్టీఆర్ జాతీయ అవార్డులను కూడా ఈ ఉత్సవంలో ప్రదానం చేస్తున్నారు. 2003, 2004, 2005, 2006 సంవత్సరాలకు సంబంధించి నాలుగేళ్లకూ ఒకేసారి అవార్డుల ప్రదానం జరుగుతుంది. 2003 సంవత్సరానికి సూపర్ స్టార్ కృష్ణ, 2004 సంవత్సరానికి ఇళయరాజా, 2005 సంవత్సరానికి కన్నడ నటుడు, రాజకీయవేత్త అంబరీష్, 2006సంవత్సరానికి వహిదీ రహమాన్ ఈ అవార్డులకు అందుకోనున్నారు. అలాగే దాదాసాహెబ్ ఫాల్కేతో సమానంగా భావించే రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డును 2005 సంవత్సరానికి ప్రముఖ కవి, దర్శక నిర్మాత, ‘మల్లెమాల’గా జగమెరిగిన ఎం.ఎస్.రెడ్డికి, 2006 సంవత్సరానికి గిన్నెస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి.రామానాయుడుకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు, పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరుకానున్నారు.
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి