జార్జి బుష్ తనను వైట్ హౌస్కు ఆహ్వానించారని, దేశ పరిస్థితిపై పరిపూర్ణంగా తనకు వెల్లడించేందుకు ఆయన హామీ ఇచ్చింనందుకు ఒబామా కృతజ్ఞతలను తెలియజేసారు. బుష్తో బైపార్టిసన్ స్పిరిట్తో కొంత కాలం పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కలసి పనిచేస్తానని ఆయన తెలిపారు. ‘బుష్ ఆహ్వానంపై తాను వైట్ హౌస్ సందర్శనలో బుష్తో తగినంత సమయం సంభాషిస్తానని ఒబామా తెలిపారు. జనవరి 20న పదవి చేపట్టగానే తాను ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు అనువైన ప్యాకేజిని మొట్టమొదట ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి ప్యాకేజిని సత్వరమే ప్రకటించకుండా అమెరికా కాంగ్రెస్ కాలక్షేపం చేసిందని ఆయన విమర్శించారు. మనం తవ్వుకున్న గుంటలో మనం పడిపోయాము. ఈ గుంట నుండి వెలికి రావడం అంత తేలికైన పనికాదు. అయితే అమెరికా చాలా శక్తివంతమైన, సమర్ధవంతమైన దేశం. రాజకీయాలను, ముఠాతత్వాన్ని పక్కన బెడితే మనం ఈ గడ్డు పరిస్థితిని అధిగమించగలమని ఒబామా తెలిపారు. కైబినెట్ పదవులను ‘పధకం ప్రకారం త్వరలో’ పూర్తి చేయనున్నామని ఆయన తెలిపారు. పథకం ప్రకారం త్వరలో పూర్తి చేస్తాననడంలో నేను ‘పథకం’ ప్రకారంగా పనిచేయండంపైన, ‘వేగంగా’ పనిచేయడం పైన కేంద్రీకరిస్తున్నాను. ఒబామా గెలుపు ప్రశంసిస్తూ ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మది నెజాద్ అభినందన లేఖను పంపారు. ఆ లేఖకు తగు విధంగా ప్రతిస్పందిస్తానని ఒబామా తెలిపారు. ఇరాన్ అణు దురాశలను ఆమోదించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అబ్రహామ్ లింకన్ రచనలను అధ్యయనం చేశానని, గత అధ్యక్షులతో మాట్లాడానని ఆయన తెలిపారు. ‘నాన్సీ రీగన్లా ఉప్పర మీటింగ్లతో (సీయన్సెస్)తో పొద్దుపుచ్చనని నేను అందరితో చెబుతున్నాన’ని ఒబామా ప్రకటించారు. ఆ తర్వాత నాలిక కరచుకొని రీగన్కు పోన్ చేసి ‘నిర్లక్ష్యంగా, అవమానకరంగా విమర్శించినందుకు క్షమించమ’ని ఒబామా కోరారు. ఆ తర్వాత రీగన్, ఒబామాలు చాలా ఆత్మీయంగా మాట్లాడు కున్నారని ఒబామా అధికార ప్రతినిధి స్టీఫెన్ కట్టర్ తెలిపారు.
Archive for నవంబర్ 8th, 2008
సంక్షోభంపై ఒబామా యుద్ధం!
Posted in Uncategorized on నవంబర్ 8, 2008| Leave a Comment »
16న ‘నంది’అవార్డుల ప్రదానోత్సవం
Posted in Uncategorized on నవంబర్ 8, 2008| Leave a Comment »
సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నంది అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 16న జరుగనుంది. తొలుత ఈ నెల 8న అవార్డుల ప్రదానం జరపాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు తేదీ ఖరారైంది. హైద్రాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరుగుతుందని ఎఫ్.డి.సి. వర్గాలు తెలిపాయి. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా 2005, 2006 సంవత్సరాలకు గాను నంది అవార్డుల ప్రదానం జరుగుతుంది. కారణాంతరాల వల్ల 2002 తర్వాత ఆగిపోయిన ఎన్టీఆర్ జాతీయ అవార్డులను కూడా ఈ ఉత్సవంలో ప్రదానం చేస్తున్నారు. 2003, 2004, 2005, 2006 సంవత్సరాలకు సంబంధించి నాలుగేళ్లకూ ఒకేసారి అవార్డుల ప్రదానం జరుగుతుంది. 2003 సంవత్సరానికి సూపర్ స్టార్ కృష్ణ, 2004 సంవత్సరానికి ఇళయరాజా, 2005 సంవత్సరానికి కన్నడ నటుడు, రాజకీయవేత్త అంబరీష్, 2006సంవత్సరానికి వహిదీ రహమాన్ ఈ అవార్డులకు అందుకోనున్నారు. అలాగే దాదాసాహెబ్ ఫాల్కేతో సమానంగా భావించే రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డును 2005 సంవత్సరానికి ప్రముఖ కవి, దర్శక నిర్మాత, ‘మల్లెమాల’గా జగమెరిగిన ఎం.ఎస్.రెడ్డికి, 2006 సంవత్సరానికి గిన్నెస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి.రామానాయుడుకు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు, పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరుకానున్నారు.
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
Posted in Uncategorized on నవంబర్ 8, 2008| Leave a Comment »
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు నడుంకట్టారు. ఎకనామిక్స్ క్రైసెస్ను ఎదుర్కొనేందుకు 17మంది సభ్యులతో ఉన్నత స్థాయి సలహా మండలిని నియమించారు. చిన్నతరహా పరిశ్రమలకు చేయూత నివ్వవనున్నట్లు ఆయన తెలిపారు. ఇతేకాకుండా దేశంలోని మధ్యతరగతి ప్రజల స్థితిగతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. దీంతో బిలియనీర్ వారన్ బఫెట్, గగూల్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎరిక్ష్మీద్ మరికొంత మంది ప్రముఖులు ఈ కమిటీలో ఉన్నారు.
వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
Posted in Uncategorized on నవంబర్ 8, 2008| Leave a Comment »
యువగర్జనపై ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి చేసిన విమర్శలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ విమర్శలకు ప్రతిగా ప్రతివిమర్శలతో ప్రజారాజ్యంపై దాడికి దిగారు దేశం నేతలు పార్టీ ఏర్పాటు జరిగిన అనతికాలంలోనే ఇతర పార్టీలు విమర్శించే స్థాయికి ప్రజారాజ్యం ఎదిగిందా పలువురు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యువగర్జనపై వివిధ పార్టీలు స్పందించాయి. ఇందులో భాగంగానే యువగర్జనను ప్రజారాజ్యం ఎద్దేవా చేసింది. గుంటూరులో ఆ పార్టీ హాహాకారాలు, ఆర్తనాదాలు చేసిందని అధికార ప్రతినిధిప్రభాక పరకాల ర్ విమర్శించారు. పీఆర్పీ వ్యాఖ్యలపై టీడీపీ ప్రతిదాడికి దిగింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తొత్తులా వ్యవహరిస్తోందంటూ విమర్శించింది. ప్రజారాజ్యం నేతలకు అప్పుడే అహంకారం తలకెక్కిందంటూ టీడీపీ నేత దాడివీరభద్రరావు మండిపడ్డారు. మరోవైపు బీజేపీ కూడా ప్రజారాజ్యంపై మండిపడుతోంది. పీఆర్పీతో పోత్తు కోసం వెంపర్లాడాల్సిన ఖర్మ బీజేపీకి పట్టలేదని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తెలిపారు. పొత్తు కావాలంటే చిరంజీవే తమ దగ్గరకి రావాలి తప్ప తాము వెళ్లే పరిస్థితి రాదన్నారు. ప్రత్యేక తెలంగాణపై ప్రజారాజ్యం పార్టీకి స్పష్టమైన వైఖరి లేదంటూ ఆరోపించిన విద్యాసాగర్రావు టీడీపీపై కూడా విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం వేడిగా మారుతోంది.
వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
Posted in Uncategorized on నవంబర్ 8, 2008| Leave a Comment »
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఏర్పాట్లు, నిర్వహిస్తున్న సమావేశాలపై జిల్లాకు చెందిన ఓ ఎంపీ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ను రాహుల్గాంధీతో పోలుస్తున్నారని, ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఏ పదవీ లేదని, పార్టీ నిబంధనలను ఉల్లంఘించి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు రావడం సరికాదని ఆ ఎంపీ తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. జగన్ ఏదో ప్రారంభోత్సవానికి జిల్లాకు వస్తుంటే ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన, పనిచేస్తున్న నాయకులు సైతం ఏర్పాట్లలో నిమగ్నమవడం దురదృష్టకరమని అంతకుముందే సదరు ఎంపీ కాకినాడ సమావేశంలో తన మనసులో మాట బయటపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. జగన్ యువసేన అంటే పార్టీకి అనుబంధ సంస్థ కాదని, అలాంటిది జిల్లాలో జగన్ పర్యటనకు కాంగ్రెస్ నేతలు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకంటూ ఆ ఎంపీ వ్యాఖ్యానించినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనేందుకు మార్గం సుగమమైనందునే జిల్లాలో 65 కిలోమీటర్ల మేర ఆయన ర్యాలీ ఏర్పాటు చేసినట్లు మరో వర్గం నేతలు పేర్కొంటున్నారు. అయితే జిల్లా నేతలు మాత్రం జగన్ పర్యటనతో యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది.
హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
Posted in Uncategorized on నవంబర్ 8, 2008| Leave a Comment »
హైతీ: హైతీ రాజధాని పోర్ట్-అ-ప్రిన్స్ సమీపంలో ఓ స్కూలు భవనం కూలిన దుర్ఘటనలో 50 మంది వరకు చిన్నారులు మృతిచెందారు. వందలమంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మూడంతస్థుల ఈ స్కూలు భవనం క్లాసులు జరుగుతుండగా కూలింది. అందులో ఎక్కువభాగం పక్కనే ఉన్న ఇళ్లపై పడటంతో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు రోదిస్తూ ఆసుపత్రులకు పరుగుతీశారు. ఐక్యరాజ్యసమితి శాంతిసేనలు, ఇతరులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అక్కడ వాతావరణం భూకంపం వచ్చిన అనంతరం పరిస్థితిలా ఉంది. ఎటుచూసినా శిధిలాలు, పిల్లల ఆర్తనాదాలు చూసేవారి గుండెను ద్రవింపజేస్తున్నాయి.