యువగర్జనపై ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి చేసిన విమర్శలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ విమర్శలకు ప్రతిగా ప్రతివిమర్శలతో ప్రజారాజ్యంపై దాడికి దిగారు దేశం నేతలు పార్టీ ఏర్పాటు జరిగిన అనతికాలంలోనే ఇతర పార్టీలు విమర్శించే స్థాయికి ప్రజారాజ్యం ఎదిగిందా పలువురు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యువగర్జనపై వివిధ పార్టీలు స్పందించాయి. ఇందులో భాగంగానే యువగర్జనను ప్రజారాజ్యం ఎద్దేవా చేసింది. గుంటూరులో ఆ పార్టీ హాహాకారాలు, ఆర్తనాదాలు చేసిందని అధికార ప్రతినిధిప్రభాక పరకాల ర్ విమర్శించారు. పీఆర్పీ వ్యాఖ్యలపై టీడీపీ ప్రతిదాడికి దిగింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తొత్తులా వ్యవహరిస్తోందంటూ విమర్శించింది. ప్రజారాజ్యం నేతలకు అప్పుడే అహంకారం తలకెక్కిందంటూ టీడీపీ నేత దాడివీరభద్రరావు మండిపడ్డారు. మరోవైపు బీజేపీ కూడా ప్రజారాజ్యంపై మండిపడుతోంది. పీఆర్పీతో పోత్తు కోసం వెంపర్లాడాల్సిన ఖర్మ బీజేపీకి పట్టలేదని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తెలిపారు. పొత్తు కావాలంటే చిరంజీవే తమ దగ్గరకి రావాలి తప్ప తాము వెళ్లే పరిస్థితి రాదన్నారు. ప్రత్యేక తెలంగాణపై ప్రజారాజ్యం పార్టీకి స్పష్టమైన వైఖరి లేదంటూ ఆరోపించిన విద్యాసాగర్రావు టీడీపీపై కూడా విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం వేడిగా మారుతోంది.
వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
నవంబర్ 8, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి