జార్జి బుష్ తనను వైట్ హౌస్కు ఆహ్వానించారని, దేశ పరిస్థితిపై పరిపూర్ణంగా తనకు వెల్లడించేందుకు ఆయన హామీ ఇచ్చింనందుకు ఒబామా కృతజ్ఞతలను తెలియజేసారు. బుష్తో బైపార్టిసన్ స్పిరిట్తో కొంత కాలం పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కలసి పనిచేస్తానని ఆయన తెలిపారు. ‘బుష్ ఆహ్వానంపై తాను వైట్ హౌస్ సందర్శనలో బుష్తో తగినంత సమయం సంభాషిస్తానని ఒబామా తెలిపారు. జనవరి 20న పదవి చేపట్టగానే తాను ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు అనువైన ప్యాకేజిని మొట్టమొదట ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఇలాంటి ప్యాకేజిని సత్వరమే ప్రకటించకుండా అమెరికా కాంగ్రెస్ కాలక్షేపం చేసిందని ఆయన విమర్శించారు. మనం తవ్వుకున్న గుంటలో మనం పడిపోయాము. ఈ గుంట నుండి వెలికి రావడం అంత తేలికైన పనికాదు. అయితే అమెరికా చాలా శక్తివంతమైన, సమర్ధవంతమైన దేశం. రాజకీయాలను, ముఠాతత్వాన్ని పక్కన బెడితే మనం ఈ గడ్డు పరిస్థితిని అధిగమించగలమని ఒబామా తెలిపారు. కైబినెట్ పదవులను ‘పధకం ప్రకారం త్వరలో’ పూర్తి చేయనున్నామని ఆయన తెలిపారు. పథకం ప్రకారం త్వరలో పూర్తి చేస్తాననడంలో నేను ‘పథకం’ ప్రకారంగా పనిచేయండంపైన, ‘వేగంగా’ పనిచేయడం పైన కేంద్రీకరిస్తున్నాను. ఒబామా గెలుపు ప్రశంసిస్తూ ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మది నెజాద్ అభినందన లేఖను పంపారు. ఆ లేఖకు తగు విధంగా ప్రతిస్పందిస్తానని ఒబామా తెలిపారు. ఇరాన్ అణు దురాశలను ఆమోదించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అబ్రహామ్ లింకన్ రచనలను అధ్యయనం చేశానని, గత అధ్యక్షులతో మాట్లాడానని ఆయన తెలిపారు. ‘నాన్సీ రీగన్లా ఉప్పర మీటింగ్లతో (సీయన్సెస్)తో పొద్దుపుచ్చనని నేను అందరితో చెబుతున్నాన’ని ఒబామా ప్రకటించారు. ఆ తర్వాత నాలిక కరచుకొని రీగన్కు పోన్ చేసి ‘నిర్లక్ష్యంగా, అవమానకరంగా విమర్శించినందుకు క్షమించమ’ని ఒబామా కోరారు. ఆ తర్వాత రీగన్, ఒబామాలు చాలా ఆత్మీయంగా మాట్లాడు కున్నారని ఒబామా అధికార ప్రతినిధి స్టీఫెన్ కట్టర్ తెలిపారు.
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి