హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ వార్తా పత్రికల పాఠకుల సంఖ్యను మదింపు వేసేందుకు మీడియా రీసెర్చ్ యూజర్ కౌన్సిల్ (ఎంఆర్యుసి) నిర్వహించే ఇండియన్ రీడర్షిప్ సర్వే (ఐఆర్ఎస్)లో తెలుగు ప్రజల అభిమానపత్రిక ఆంధ్రజ్యోతి రికార్డు సృష్టించింది. తెలుగుతో సహా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని భాషాపత్రికల రీడర్ షిప్ తిరోగమనంలో ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతి ఒక్కటే పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నది.
ప్రాంతీయ భాషా పత్రికలకు సంబంధించి రీడర్షిప్ వృద్ధిలో దేశంలోనే నెంబర్వన్గా నిలిచింది. వృద్ధి విషయంలో దక్షిణాదిలో మరే పత్రికా ఆంధ్రజ్యోతి దరిదాపుల్లో కూడా లేదు. వాస్తవానికి ఐఆర్ఎస్ 08- రౌండ్ 2 సర్వే వివరాల ప్రకారం తొలి రౌండ్తో పోలిస్తే దేశవ్యాప్తంగా పలు ప్రధాన దిన, వార, మాసపత్రికల పాఠకుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రాంతీయ భాషా పత్రికల్లో ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా ఉంది.
అయితే పాఠకుల మొక్కవోని అభిమానం కారణంగా ఆంధ్రజ్యోతి మాత్రం ఈ ట్రెండ్కు అతీతంగా నిలిచింది. నిర్బీతితో కూడిన వార్తా కథనాలు, నికార్సైన జర్నలిస్టు విలువలతో రాణిస్తున్న ఆంధ్రజ్యోతికి పాఠకులు పడుతున్న నీరాజనానికి ఇది తిరుగులేని రుజువు. తెలుగులో ఆంధ్రజ్యోతి ఆధిక్యతను, పెరుగుతున్న పాఠక జనాదరణను ఈ సర్వే స్పష్టంగా తెలియజేసింది.
ఐఆర్ఎస్ 08 తొలి రౌండ్తో పోలిస్తే రెండో రౌండ్ సర్వే ప్రకారం ఆంధ్రజ్యోతి పాఠకుల సంఖ్య 4,94,000 మేర పెరిగింది. తొలి రౌండ్లో 63,17,000 ఉన్న పాఠకుల సంఖ్య ఇప్పుడు 68,11,000 కు చేరింది. ఇదే సమయంలో తెలుగుతో సహా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతీయ భాషా పత్రికల రీడర్ షిప్ మాత్రం గణనీయంగా తగ్గింది.
ఐఆర్ఎస్-08 రౌండ్ 2 సర్వే వివరాలు (పాఠకుల సంఖ్య లక్షల్లో ) |
|||
పత్రికలు |
ఐఆర్ఎస్ 08 రౌండ్ 1 |
ఐఆర్ఎస్ 08 రౌండ్ 2 |
పెరుగుదల/ తరుగుదల |
ఆంధ్రజ్యోతి |
63.17 |
68.11 |
+ 4.94 |
ఈనాడు |
147.24 |
144.11 |
– 3.13 |
వార్త |
66.48 |
63.46 |
– 3.02 |
ఆంధ్రభూమి |
16.92 |
14.29 |
– 2.63 |
ఆంధ్రప్రభ |
7.21 |
4.75 |
– 2.46 |
తెలుగులోనే మరో ప్రధాన పత్రిక ఈనాడు పాఠకుల సంఖ్య తొలి రౌండ్తో పోలిస్తే 3,13,000 మేర తగ్గింది. వార్త దినపత్రిక పాఠకుల సంఖ్య 3,02,000 తగ్గింది. హిందీ పత్రికలు దైనిక్ భాస్కర్, హిందుస్తాన్ను మినహాయిస్తే వివిధ భాషలకు చెందిన (ఇందులో కొన్ని హిందీ పత్రికలు కూడా ఉన్నాయి) 110 పత్రికల్లో కేవలం ఆంధ్రజ్యోతికి మాత్రమే గరిష్ఠ స్థాయిలో పాఠకుల సంఖ్య పెరిగింది.
ఈ 110 పత్రికల్లో అంతో ఇంతో రీడర్షిప్ పెరిగిన పత్రికలు కేవలం 20 మాత్రమే ఉన్నాయి. మిగితా 80 పత్రికలు తరుగుదలనే చవిచూశాయి. రీడర్ షిప్ పెరిగిన ఇరవై పత్రికల్లో నాలుగులక్షలపైబడి రీడర్షిప్ పెరిగిన పత్రికలు రెండే రెండు ఉన్నాయి. అందులో ఆంధ్రజ్యోతి అగ్రస్థానంలో ఉంది. మొత్తం 23 రాష్ట్రాల్లో 81 నగరాల్లో 2,54,913 మంది పాఠకులను ఈ ఐఆర్ఎస్ రౌండ్ 2 కోసం సర్వే చేసినట్టుగా మీడియా రీసెర్చ్ యూజర్ కౌన్సిల్ వెల్లడించింది.
వ్యాఖ్యానించండి