తిరుపతిలో కిడ్నాప్కు గురైన చిన్నారి ఆయేషా శవమై తేలింది. ఓ ప్రైవేటు పాఠశాల్లో మూడో తరగతి చదువుతున్న ఆమెను డబ్బు కోసం కిడ్నాప్ చేసిన కొందరు దుర్మార్గులు గొంతు నులిమి చంపేశారు. తమ కుమార్తె తిరిగి వస్తుందని ఎదురు చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తిరుపతి కోర్లగుంటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడోతరగతి చదువుచున్న తొమ్మిదేళ్ళ ఆయేషా నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆయేషా తల్లిదండ్రులకు ఫోన్ చేసి రెండు లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదా చంపేస్తామని బెదిరించారు. దీంతో ఏమి చేయాలో పాలపోని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే తమ బిడ్డని చంపేస్తారని భయపడి డబ్బు కోసం ప్రయత్నించారు. అయితే ఈ కిడ్నాప్ విషయం అల్లరికావడంతో భయపడిన అగంతకులు చిన్నారి ఆయేషాను గొంతు నులిమి హత్య చేసి స్థానికంగా ఉన్న రామాలయం దగ్గర లారీ క్యాబిన్లో పడేశారు. ఆయేషా మరణవార్త తల్లిదండ్రులకు తెలియడంతో వారు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే ఈ కేసులో అనుమానితునిగా భావిస్తున్న మృతురాలి మేనమామ హబీబ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుపతి కేవలం పేరుకే పుణ్యక్షేత్రంగా ఉందని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండాల్సిన ఈ ప్రాంతం ఇప్పుడు హత్యలతో రక్తసిక్తమౌతోందన్నారు. చిన్నారి ఆయేషాను కిడ్నాప్ చేసి దారుణంగా హత్యచేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా తిరుపతిలో జరుగుతున్న చిన్నారుల కిడ్నాప్లతో తల్లిదండ్రులు భయానికి లోనవుతున్నారు.
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి