సిరీస్ను డిసైడ్ చేసే నాగపూర్ టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. సచిన్ సెంచరీ, లక్ష్మణ్, సెహ్వాగ్లు అర్థ సెంచరీలతో భారత్ తొలి రోజులో ఆసీస్ పై పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. తొలి టెస్ట్ ఆడుతున్న విజయ్తో కలసి డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ భారత్కు శుభారంభం ఇచ్చాడు. అయితే ద్రవిడ్ ఫెల్యూర్తో వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోవడంతో భారత్ ఒత్తిడిలో పడ్డట్టు కనిపించింది. అయితే వందో టెస్ట్ ఆడుతున్న లక్ష్మణ్, సచిన్లు బాధ్యతాయుతంగా ఆడి భారత్ను సురక్షిత స్థానంలో నిలిపారు. చివర్లో గంగూలీ, ధోనీలు ఆచితూచి ఆడారు. దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక ఈ రోజు ఆటలో భారత్ సాధించే పరుగుల మీదే ఈ మ్యాచ్ భవితవ్యం ఆధారపడివుంది.
నాగపూర్ టెస్ట్లో చెలరేగిన బ్యాట్స్మెన్లు
నవంబర్ 7, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి