అభిప్రాయభేదాలను పక్కనబెట్టి కలిసికాపురం చేయడానికి వామపక్షాలు సిద్దమవుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోమంటూ చేసిన ప్రకటనను స్వాగతిస్తామని చెబుతున్న వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని చెబుతున్నాయి. బీజేపీతో పొత్తుపై ప్రజారాజ్యం మరింత స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో భేటీ అయిన రాఘవులు ఇప్పటివరకు పొత్తులపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసే పని చేస్తాయని ఆయన ప్రకటించారు. ప్రజాసమస్యలపై భావ సారూప్యం ఉన్న పార్టీలతో కలిసి పోరాటాలు చేస్తామని రాఘవులు వివరించారు. వామపక్షాల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని సీపీఐ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని.. చిరంజీవి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. పొత్తులపై చర్చిస్తున్నామని త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉధ్యమాలపైనే దృష్టిపెడతామని చెబుతున్న ఈ పార్టీలు పోరాటాల తర్వాతే ఎన్నికల ఎత్తుగడలుంటాయంటున్నారు.
భూ ఉద్యమాలపై దృష్టిపెట్టిన వామపక్షాలు
నవంబర్ 7, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి