వరుస హత్యలు, కిడ్నాప్లతో తిరుపతి మారుమ్రోగుతోంది. స్కూలుకు వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు టెన్షన్ తప్పడం లేదు. గత నవంబర్లో గురు శ్రీను అనే బాలుడ్ని కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే మరో చిన్నారి దారుణహత్యకు గురైంది. ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతి నగరం ఇప్పుడు వరుస హత్యలతో మారుమోగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న హత్యలతో ప్రజలు భయానికి లోనవుతున్నారు. ప్రధానంగా స్కూలు పిల్లలను టార్గెట్గా చేసుకొని జరుగుతున్న కిడ్నాప్లు, హత్యలతో తల్లిదండ్రులను భయానికి గురిచేస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్లో గురు శ్రీను అనే బాలుడ్ని సమీప బంధువులే కిడ్నాప్ చేసి పది లక్షలు డిమాండ్ చేశారు. అయితే వారి కోసం పోలీసులు రంగంలోకి దిగడంతో భయపడిన కిడ్నాపర్లు అతికిరాతంగా గొంతుకోసి చెరువులో పడేశారు. అప్పట్లో ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల తిరుపతి భవానీనగర్లో టైలర్ విజయ్కుమార్ భార్య, ఇద్దరు చిన్నారులను సమీప బంధువే హత్య చేశారు. పనికోసం విజయకుమార్ బయటకు వెళ్ళిన సమయంలో అతని భార్య వనజాక్షి, పిల్లలు మోనీష్ శ్రావణిలను మనోహరే హత్య చేశాడు. అదే రోజు రాత్రి పిలతీర్థం దగ్గర ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఓ ప్రైవేటు కంపెనీలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోన్న రోహిణిపై కొందరు దుర్మార్గులు అత్యాచారం చేసి కిరాతకంగా హత్యచేసి ముళ్ళపొదల్లో పడేశారు. తెల్లవారేసరికి ఈ రెండు హత్యల విషయం బయటపడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనలు జరిగి పదిహేను రోజులు గడవకముందే చిన్నారి ఆయేషా హత్యోదంతం తెరపైకి వచ్చింది. చదువుకోసం, ఉద్యోగాల కోసం బయటకు వెళ్తున్న చిన్నారులు, యువతులకు రక్షణ లేకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో రోజు రోజుకు మానవతా విలువలు మంటగలిసిపోతున్నాయి. వరుసగా జరుగుతున్న హత్యోదంతాలు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నాయి.
వరుస హత్యలతో మారుమ్రోగుతున్న తిరుపతి
నవంబర్ 7, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి