ఎవరైనా మనల్ని పండుగ ఏలా జరుపుకున్నారు అని అడిగితే ఘనంగా జరుపుకున్నాం అని బదులిస్తాం. అయితే ఆ పండుగ విశిష్టత ఏమిటని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేము. కానీ, ప్రతి పండగకు దాని విశిష్టత తెలిసేలా సాధారణ ముగ్గు పిండితో కళాకండాలను సృష్టిస్తూ ఔరా అనిపించుకుంటోంది కావలికి చెందిన ఓ గృహిణి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం జనతాపేటలో దేవసేన నివాసం ఉంటోంది. గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి పండుగకు ఆ పండుగ విశిష్టత తెలిసేలా ముగ్గులువేసి అందరి మన్ననలు అందుకుంటోంది. వేసేది ముగ్గుపిండితోనైనా అందులోని భావాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తన ముగ్గు ద్వారా దీపావళి ప్రతిష్టను తెలపడానికి ఆమె లక్ష్మీదేవి, నరకాసుర వధ వంటి ముగ్గులు వేసి దీపావళి ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు. పాశ్చాత్య వ్యామోహనికి లోనై మన భాష కట్టుబొట్టులకు దూరమవుతున్న నేటి యువతకు ఎంతో చరిత్రకలిగిన మన సంస్కృతి వైపు యువతను మార్చేందుకు ఓ చిన్న ప్రయత్నం చేసున్నానంటోంది దేవసేన.
ముగ్గు పిండితో కళాకండాలను సృష్టిస్తున్న గృహిణి
అక్టోబర్ 28, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి